పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

X
డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, డీజిల్పై 13 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.81.18కి పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర రూ.80.43గా ఉన్నది.
గత నెల 7నుంచి 22 రోజులపాటు పెట్రో, డీజిల్ ధరలు వరుసగా పెరిగాయి. దీంతో లీటర్ డీజిల్పై రూ.11.4 పైసలు పెరిగాయి. పెట్రోల్ ధరలు చివరిసారిగా జూన్ 29న పెరిగాయి. అప్పటి నుంచి దేశంలో పెట్రోల్ కంటే డీజిల్ ధరలే అధికంగా ఉంటున్నాయి.
Next Story