Home సినిమా చిలుకూరు బాలాజీ ని దర్శించుకున్న ప్రియాంక చోప్రా..ssmb 29కోసమేనా! – Sneha News

చిలుకూరు బాలాజీ ని దర్శించుకున్న ప్రియాంక చోప్రా..ssmb 29కోసమేనా! – Sneha News

by Sneha News
0 comments
చిలుకూరు బాలాజీ ని దర్శించుకున్న ప్రియాంక చోప్రా..ssmb 29కోసమేనా!


ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(ప్రియాంక చోప్రా)కి భారతీయ సినీ ప్రేమికుల్లో ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.ప్రపంచ సుందరి కిరీటాన్ని కూడా దక్కించుకున్న ప్రియాంక ‘తమిళన్’ అనే తమిళ చిత్రం ద్వారా అరంగ్రేటం చేసింది.ఆ తర్వాత హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసింది. చేసుకుంది.హాలీవుడ్ లో కూడా పలు చిత్రాలతో పాటు,పలు వెబ్ సిరీస్ లో చేసిన ప్రియాంక తెలుగులో కూడా రామ్ చరణ్ తో తుఫాన్ అనే మూవీలో చేసింది.

ఆమె నిన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ శ్రీ చిలుకూరు బాలాజీని దర్శించుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎస్ఎస్ రంగరాజన్ ప్రియాంకకి దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించడంతో పాటు,ఆలయం యొక్క విశిష్టత గురించి వివరించారు.అనంతరం తీర్ధ ప్రసాదాలు అందించారు.ప్రియాంక ప్రస్తుతం మహేష్ బాబు(మహేష్ బాబు)రాజమౌళి(రాజమౌళి)కాంబోలో తెరకెక్కబోతున్న ssmb 29 లో హీరోయిన్ గా నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి. స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికే వచ్చినట్టుగా తెలుస్తుంది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech