ఏం జరిగిందంటే…
ఎల్బీనగర్లో ఓ కారును నడిరోడ్డుపై ఆపాడు డ్రైవర్. ముందు వెనకా చూసుకోకుండా నిర్లక్ష్యంగా కారు డోర్ను తెరిచాడు. అయితే ఇదే టైంలో వెనుక నుంచి ఓ దంపతులు చిన్నారితో కలిసి బైక్ పై వస్తున్నారు. సడన్ గా డోర్ తీయతో వెనక నుంచి వస్తున్న బైక్ కు తగిలింది. దంపతులు, చిన్నారి కిందపడిపోయారు. కారు డోర్ బలంగా తగలడంతో రెండేళ్ల చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో తల్లి కూడా తీవ్రంగా గాయపడగా….ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కనిపిస్తోంది.ప్రమాదం జరిగిన కారు డ్రైవర్ పరారయ్యాడు.